Wednesday, November 7, 2012

అదొక తియ్యని కల.. రోజు కంటున్న కల... షరా మాములుగా మళ్లీ ఈరోజు కూడా వచ్చింది.

సమాజం అంటే ఏంటో తెలియని వయసులోనే నేను సమాజానికి ఎదో ఒకటి చేయాలి అని ఆరాట పడుతుండేవాడిని . వయసు తో పాటు సమాజం అంటే ఒక అవగాహన ఎం చేయాలి అనే స్పష్టత వచ్చాయి. అదే ఈ కల



అదొక పెద్ద భవనం. సుమారుగా ౩౦౦- మంది విద్యార్థులు నివాసముంటున్న భవనం. వారంతా అభాగ్యులు, అనాధలు. వారికి తిండి కూడు బట్ట విద్య అన్నీ అక్కడే. సమాజానికి మంచి పౌరులను అందిచడమే ధ్యేయంగా కొంతమంది మిత్రులు చేత స్థాపించబడిన ఒక సేవాసదనం.

అక్కడి విద్యార్థులు ఆటల్లోనూ పాటల్లోనూ సేవలోను అన్నింటిలోను ముందే. భారతీయ సంప్రదాయాలు, విలువలు, మానవత్వపు పరిమళాలు, ధర్మ-అధర్మాలు అన్నీ నేర్పుతారు అక్కడ.

ఆ సేవాసదనంను చూసి అందరు గర్వపడుతుంటారు. అక్కడ పాటశాలలో చేరాలని పిల్లలు ఉవ్విల్లురుతుంటారు. ఆ వాతావరణం లో గడపాలని ఉబలాటపడుతుంటారు. ఆ పాటశాల రవీంద్రుని శాంతినికేతనం. ఆ ఆట మైదానం అమ్మ ఒడి.

వాళ్ళందరి మధ్య, పండిన తలతో, పిల్లలతో ఆడుకుంటూ.. అదే ఆనందం అనే భావనలో.. .నేను!!

ఇదే నా కల! నన్ను నిద్రపోనివ్వని కల!!

మొదటి అడుగు పడింది.. స్వదేశ్నిర్మాణ్ అనే సదనం ప్రారంభమైంది.
 అడుగులు వేస్తోంది గమ్యం వైపు.

No comments: